గురుకుల డిగ్రీ కళాశాలల్లో ఆన్లైన్ తరగతులు
లాక్డౌన్ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో ఈ నెల 30 వరకు ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు ఆ సొసైటీ కార్యదర్శి ప్రవీణ్కుమార్ తెలిపారు. టీశాట్ టీవీ ఛానల్ ద్వారా నిపుణులైన అధ్యాపకులతో కామర్స్, కంప్యూటర్ సైన్స్, మైక్రోబయాలజీ, మేథమెటిక్స్, బోటనీ, ఎలక్ట్రానిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, తెలుగు, ఇంగ్లిష్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లైఫ్స్కిల్స్లో తరగతులు ఉంటాయని పేర్కొన్నారు.