This Blog used for Education,Jobs and New's Purpose.
If you have any query regrading Site, Advertisement and any other issue, please feel free to contact at srieducation01@gmail.com
సంఘటనలు 1893 : మొదటి మహిళల గోల్ఫ్ ఛాంపియన్షిప్ రాయల లీథం అనే చోట నిర్వహించబడింది. 1974: ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు పశ్చిమ జర్మనీలో ప్రారంభమయ్యాయి. 1982: ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు స్పెయిన్లో ప్రారంభమయ్యాయి. జననాలు 1831 : ప్రముఖ భౌతిక, గణిత శాస్త్రవేత్త జేమ్స్ క్లర్క్ మాక్స్వెల్ జననం (మ.1879) 1889 : సాలార్జంగ్ మ్యూజియం ప్రధాన సేకరణ కర్త మీర్ యూసుఫ్ అలీఖాన్ (మూడవ సాలార్జంగ్) జననం.(మ.1949). 1896: కిరికెర రెడ్డి భీమరావు, తెలుగు, కన్నడ భాషలలో కవిత్వమల్లినవాడు. (మ.1964) 1909: ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ జననం (మ.1998). 1930: మార్పు బాలకృష్ణమ్మ, ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా పనిచేశారు. (మ.2013) 1937: డా.రాజ్ రెడ్డి, ఒక కంప్యూటర్ శాస్త్రవేత్త, టూరింగ్ అవార్డు గ్రహీత, కంప్యూటర్ సైన్సు, కృత్రిమ మేధస్సు పై ఖ్యాతి గడించాడు. 1965: మణీందర్ సింగ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. మరణాలు 1719: రఫీయుల్ దర్జత్, భారతదేశపు 10వ మొఘల్ చక్రవర్తి. (జ.1699) 1962: కప్పగల్లు సంజీవమూర్తి, ఉపాధ్యాయుడు, రచయిత. (జ.1894) 2013: తరిట్ల ధర్మారావు, మధ్యప్రదేశ్ ఇండ...
టెన్త్ పరీక్షలపై ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతోంది. కరోనావైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇప్పుడే 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం అవసరమా అని ఇప్పటికే హైకోర్టు ( TS High court ) ప్రశ్నించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇవాళ జరిగిన విచారణలోనూ హై కోర్టు పలు కీలకమైన ప్రశ్నలు లేవనెత్తింది. ఒకవేళ పరీక్షలు నిర్వహించడానికే సిద్ధమైతే మరి కంటైన్మెంట్ జోన్లలో ఉన్న టెన్త్ క్లాస్ విద్యార్థుల పరిస్థితేంటని హై కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే, 10వ తరగతి పరీక్షలు ఇప్పుడు రాసుకోలేకపోయిన విద్యార్థులను సప్లిమెంటరీకి అనుమతి ఇస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. మరి సప్లిమెంటరీలో పాస్ అయితే రెగ్యులర్ విద్యార్థులుగా గుర్తిస్తారా అని హైకోర్టు సందేహం వ్యక్తంచేసింది. ఈ ప్రశ్నలన్నింటికీ రేపు సమాధానం చెప్పాలని వ్యాఖ్యానించిన హై కోర్టు.. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. హై కోర్టు ప్రశ్నలన్నింటికీ ప్రభుత్వాన్ని సంప్రదించి రేపు సమాధానం చెబుతామని అడ్వకేట్ జనరల్ బి.ఎస్. ప్రసాద్ కోర్టుకు తెలిపారు. ఎస్.ఎస్.సి ఎగ్జామ్స్ రీ...
RTE - ACT భారతదేశం లో : 6 నుంచి 14 ఏండ్లలోపు ఉన్న బాలలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించటానికి ఉద్దేశించిన చట్టమే Right to Free a-d Compulsory Education- Act 2009. ఈ విద్యాహక్కు చట్టం 2009 ఆగస్టు 28న రాష్ట్రపతి ఆమోదం పొందింది. కేంద్ర ప్రభుత్వం 2009 ఆగస్టు 26న ఈ బిల్లును ఆమోదించింది. జమ్ముకశ్మీర్ మినహా దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ చట్టం 2010 ఏప్రిల్ 1న అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలో 7 అధ్యాయాలు, 38 సెక్షన్లు, ఒక అనుబంధ షెడ్యూల్ ఉన్నాయి . విద్యాహక్కు చట్టం ముఖ్యాంశాలు : అధ్యాయం -1 సెక్షన్-1 చట్టం పేరు: ఉచిత నిర్బంధ విద్య బాలల హక్కు చట్టం 2009 చట్టం పరిధి: జమ్ముకశ్మీర్ మినహా దేశం మొత్తం వర్తిస్తుంది. చట్టం అమలు తేదీ: 2010, ఏప్రిల్ 1 సెక్షన్-2 6 నుంచి 14 ఏండ్ల మధ్య వయసున్నవారు బాలబాలికలు ప్రాథమిక విద్య అంటే 1 నుంచి 8 తరగతి వరకు క్యాపిటేషన్ ఫీజు అంటే బడి ప్రకటించిన ఫీజు కాకుండా ఇతర రూపాల్లో చెల్లించే చందాలు స్థానిక ప్రభుత్వం అంటే నగరపాలక సంస్థ లేదా జిల్లా పరిషత్ లేదా గ్రామ...