నీట్,జేఈఈ పరీక్షల తేదీలు

నీట్,జేఈఈ పరీక్షల తేదీలుఖరారయ్యాయి. జులై 18 నుంచి 23 వరకూ జేఈఈ మెయిన్ పరీక్షలు జరుగుతాయని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. జులై 26న నీట్ పరీక్ష నిర్వహిస్తామని .సీబీఎస్‌ఈ పరీక్షలతో పాటు పది, పన్నెండో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్‌పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
వాస్తవానికి జేఈఈ మెయిన్స్ పరీక్ష ఏప్రిల్ నెలలో నిర్వహించాల్సి ఉండగా, నీట్ పరీక్ష మే 3న నిర్వహించాల్సి ఉంది. అయితే, దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి లాక్‌డౌన్‌ విధించడంతో పలుమార్లు పరీక్షల నిర్వహణ వాయిదా పడింది.

Popular posts from this blog

నేటి ముఖ్యాంశాలు.. 13 Jun, 2020

చరిత్రలో ఈ రోజు 13 జూన్ 2020

10వ తరగతి పరీక్షలపై కొనసాగుతున్న సస్పెన్స్