🌏 చరిత్రలో ఈరోజు మే 5

సంఘటనలు

1260: కుబ్లైఖాన్ మంగోల్ చక్రవర్తి అయ్యాడు.

1494: క్రిస్టోఫర్ కొలంబస్ జమైకా ద్వీపాన్ని కనుగొన్నాడు.

1912: ఐదవ ఒలింపిక్ క్రీడలు స్టాక్‌హోమ్ లో ప్రారంభమయ్యాయి.

1945: డెన్మార్క్, నాజీ కబందహస్తాలనుంచి, విడుదలైంది.

1956: మొదటి ప్రపంచ జూడో ఛాంపియన్‌షిప్ పోటీలు, జపాన్‌  టొక్యో నగరంలో జరిగాయి.

1958: అమెరికా, ఎన్వెటక్ అనే చోట, వాతావరణంలో, అణుబాంబును పేల్చి, పరీక్షించింది

1961: అలన్ షెపర్డ్ [1], మొదటి అమెరికన్ రోదసీ యాత్రికుడు (రోదసీ నౌక పేరు: ఫ్రీడం 7)

1970: అమెరికా, నెవడా పరీక్షా కేంద్రంలో, అణుబాంబును పేల్చి, పరీక్షించింది.

1979: రోదసీ నౌక వాయేజర్ 1 [2], జూపిటర్ గ్రహాన్ని దాటి తన ప్రయాణాన్ని విశ్వాంతరాళంలోకి కొనసాగిస్తున్నది.

1987: ప్రాన్స్, మురౌరా దీవిలో, అణుబాంబును పేల్చి, పరీక్షించింది


జననాలు


1895: జ్ఞానాంబ, తెలుగు రచయిత్రి

1917: జి.ఎస్.రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరపున మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గం ఎమ్.పి.గా 1967-1970, 1977-79, 1980-1984లలో ఎన్నికయ్యారు.

1930: పిఠాపురం నాగేశ్వరరావు, ప్రముఖ సినీ సంగీత దర్శకులు.

1946: రమాప్రభ, హాస్య నటిగా ఎంతో పేరు తెచ్చుకున్న రమాప్రభ ఎన్నో సినిమాల్లో, ఎంతోమంది సరసన నటించింది.

1958 : కొక్కుల పద్మావతి, కథా రచయిత, అనువాదకురాలు.

1963: సబితా ఇంద్రారెడ్డి, మంత్రివర్గంలో కీలకమైన హోంశాఖా మంత్రి పదవిని పొంది హోంశాఖా మంత్రిపదవిని అధిష్టించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది.

1989: లక్ష్మీ రాయ్, భారతీయ సినీ నటి.


మరణాలు


1821: నెపోలియన్, ఫ్రెంచ్ చక్రవర్తి. (జ.1769)

1995: నాగభూషణం, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (జ.1921)

2011: క్లాడ్ ఛౌల్స్ (బ్రిటన్ లో పుట్టాడు) 110వ సంవత్సరాల వయసులో పశ్చిమ ఆస్ట్రేలియాలో మరణించాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో రాయల్ నేవీ తరపున పోరాడి, 2011 మే 5 వరకు బ్రతికిన చివరి యోధుడు. (జ. 1901)

2017: లీలా సేథ్ ఢిల్లీ హైకోర్టుకు మొదటి మహిళా న్యాయమూర్తి. (జ.1930)

2019: అరుణోదయ రామారావు విప్లవ సాంస్కృతోద్యమనేత, కళాకారుడు, ప్రజా గాయకుడు, కవి (జ.1955)


🔷 జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు 🔷


🔻వరల్డ్ అథ్లెటిక్స్ దినోత్సవం.

🔻అంతర్జాతీయ మంత్రసానుల దినోత్సవం.

Popular posts from this blog

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

🌏 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 28