చరిత్ర లో ఈరోజు మే 11


సంఘటనలు

1752 : మొదటి అగ్నిప్రమాద భీమా పధకాన్ని అమెరికాలో మొదలు పెట్టారు (ఫిలడెల్ఫియా)

1772 : ఆమ్‌స్టర్‌డాం థియేటర్ (రంగశాల) అగ్నిప్రమాదంలో తగులబడి, 18 మంది మరణించారు.

1792 : అమెరికన్ కెప్టెన్ రాబర్ట్ గ్రే, కొలంబియా నదిని కనుగొని, దానికి కొలంబియా అని పేరు పెట్టారు.

1833 : లేడీ ఆఫ్ ది లేక్ అనే నౌక మంచుఖండాన్ని (ఐస్‌బెర్గ్), ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో ములిగిపోయింది. 215 మంది మరణించారు.

1850: మొదటి సారిగా ఇటుకలతో భవనాలు కట్టడం శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో మొదలైంది.

1893 : హెన్రీ డెస్‌గ్రేంజ్ మొదటి ప్రపంచ సైకిల్ రికార్డుని స్థాపించాడు (35.325 కి.మీ)

1916 : ఐన్‌స్టీన్ తన సాపేక్ష సిద్ధాంతం వెల్లడించాడు. (థియరీ ఆఫ్ జనరల్ రెలెటివిటీ).

1921 : టెల్ అవివ్ మొట్టమొదటి యూదుల మునిసిపాలిటీ (నేటి ఇజ్రాయిల్ రాజధాని).

1928: జనరల్ ఎలెక్ట్రిక్ కంపెనీ మొదటి టెలివిజన్ కేంద్రాన్ని (టి.వి.స్టేషను) ని మొదలు పెట్టింది (న్యూయార్క్ లోని షెనెక్టాడీ లో).

1929: రోజువారీ టెలివిజన్ ప్రసారాలు మొదటిసారిగా ప్రసారమయ్యాయి (వారానికి 3 రాత్రులు).

1949: ఇజ్రాయిల్ 37-12 ఓట్లతో, 59వ సభ్యదేశంగా, యునైటెడ్ నేషన్స్ లో చేరింది.

1955: ఇజ్రాయిల్ గాజా మీద దాడి చేసింది.

1961 : హైదరాబాదులో ప్రముఖ సమావేశ మందిరం, రవీంద్ర భారతి ప్రారంభించబడింది.

1965: భారతదేశంలో, 1965 లో, ఒక్క నెలలోపే వచ్చిన 2 తుఫానులలో, మొదటి తుఫానుకి 35,000 మంది మరణించారు.

1991: కళాభారతి ఆడిటోరియము విశాఖపట్నంలోని పిఠాపురం కాలనీలో ప్రారంభించారు.

1991 మార్చి 3 విశాఖపట్నంలో సాంస్కృతిక కార్యక్రమాలకు, సంప్రదాయ కళలకు కాణాచి అయిన కళాభారతి వ్యవస్థాపక దినోత్సవము.

1998 : భారత్ రెండోసారి అణుపరీక్షలు జరిపింది. ఈ తేదీని జాతీయ వైజ్ఞానిక దినోత్సవంగా జరుపుతున్నారు

2000: భారతదేశ జనాభా 100 కోట్లకు చేరింది.

జననాలు

1895: జిడ్డు కృష్ణమూర్తి, భారతదేశపు తత్త్వవేత్త (సాంగ్స్ ఆఫ్ లైఫ్)

1918 : భారతీయ సాంప్రదాయ నృత్యకళాకారిణి,నృత్యదర్శకురాలు మృణాళినీ సారభాయ్ జననం (మ.2016).

1922:  తెలుగు సినిమా నేపథ్య గాయకుడు మరియు రంగస్థల నటుడు మాధవపెద్ది సత్యం జననం,తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, సింహళ భాషలతో సహా దాదాపు అన్ని భారతీయ భాషలలో 7,000 పైగా పాటలు పాడి ప్రసిద్ధి చెందాడు.(మ.2000)

1925: వల్లూరి వెంకట్రామయ్య చౌదరి, రంగస్థల నటుడు, బాలనాగమ్మలో ఫకీరుగానూ, రామాంజనేయ యుద్ధంలో యయాతిగానూ, సక్కుబాయిలో శ్రీకృష్ణుడుగానూ, సత్యహరిశ్చంద్రలో నక్షత్రకుడిగా నటించారు.

1928 : తెలుగు మరియు ఉర్దూ రచయిత, హిందుస్తానీ సంగీత పండితుడు సామల సదాశివ జననం, ఆదిలాబాదు జిల్లాకు చెందిన సాహితీవేత్త (మ.2012).


1977: పోసాని సుధీర్ బాబు, తెలుగు సినిమా నటుడు. తెలుగు నటుడు ఘట్టమనేని కృష్ణ చిన్నల్లుడు.

మరణాలు

1873: మంత్రిప్రెగడ సూర్యప్రకాశ కవి, మాడుగుల సంస్థాన ప్రభువైన శ్రీకృష్ణ భూపాలుని ఆస్థానంలో కవి, పండితుడు.

1994: సర్దేశాయి తిరుమలరావు, తైల పరిశోధనా శాస్ర్తవేత్త, సాహితీ విమర్శకుడు. (జ.1928)

2017: సి.ఆర్.ఎం.పట్నాయక్ వంశధార ప్రాజెక్టును డిజైన్ చేసిన ఇంజనీరు.

జాతీయ దినోత్సవాలు.

జాతీయ సాంకేతిక దినోత్సవం

Popular posts from this blog

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

🌏 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 28