పాత హాల్‌ టికెట్లతోనే పది పరీక్షలు



  • ప్రస్తుత సెంటర్లకు దగ్గర్లోనే కొత్తవి


  • తొలి రోజు ఆలస్యమైనా అనుమతి


  • జూన్‌ మొదటి వారంలో పరీక్షలు!

కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాల సంఖ్యను రెట్టింపు చేస్తామని ప్రకటించినా.. పాత హాల్‌టికెట్లతోనే పదో తరగతి పరీక్షలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుత పరీక్ష కేంద్రాలకు దగ్గర్లోనే నూతన కేంద్రాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. బెంచీకి ఒకరు చొప్పున ఒక హాలులో 10-12 మంది విద్యార్థులను మాత్రమే కూర్చోబెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. తొలి రోజు పరీక్షకు ఆసల్యమైనా విద్యార్థులను అనుమతిస్తామని అధికారులు తెలిపారు. జూన్‌ మొదటి వారంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది

Popular posts from this blog

నేటి ముఖ్యాంశాలు.. 13 Jun, 2020

చరిత్రలో ఈ రోజు 13 జూన్ 2020

GK