ఎన్టీఏ పరీక్ష'ల గడువు పెంపు: ఓపెన్ మ్యాట్

 నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించే ఓపెన్ మ్యాట కు దరఖాస్తు చేసుకునేందుకు నిర్దేశించిన గడువును మే 15 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫర్ చేసే పిహెచ్డి, ఓపెన్ మ్యాట్ (ఎంబిఎ)6 దేశానికి ఈ టెస్టులో అర్హత సాధించాలి.www.ignouexams.nta.nic. దరఖాస్తు చేసుకోవాలి. అలాగే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ జెఇఇ 2020, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసిఎఆర్) 2020, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎంట్రెన్స్ ఎగ్జామినే షన్ (జెఎన్యూ ఇఇ) కు మే 15 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలిండియా ఆయుష్ పీజీ ఎంట్రెన్స్ టెస్ట్ కు గడువును జూన్ 5 వరకు పొడిగించారు.



  • సెంట్రల్ వర్సిటీ సెట్ గడువు పొడిగింపు...

దేశవ్యాప్తంగా ఉన్న 14 సెంట్రల్ యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్న వివిధ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు ప్రవేశానికి ఉద్దే శించిన ఉమ్మడి టెస్టు దరఖాస్తు ప్రక్రియ ఆరంభమైంది. 'సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (సియుసిఇటి) 2020కి మే 23 లోపు దరఖాస్తు చేసుకోవాలి.www.cucetexam.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.


  • సీఏ కోసం వర్చువల్ పీజీ, సర్టిఫికెట్ కోర్సులు..


 ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా( ఐసీఏఐ) తమ సభ్యుల కోసం వర్చ్యువల్ మోడ్ లో పోస్టు క్వాలిఫికేషన్/ సర్టిఫికెట్ కోర్సులను ఆరంభించింది. ఆన్లైన్లో మొత్తం 3 కోర్సులను పరిచయం చేసింది.

1.సర్టిఫికెట్ కోర్సు ఆన్ ఫోరెన్సిక్ అకౌంటింగ్ అండ్ ఫ్రెండ్ డిటెక్షన్

2.సర్టిఫికెట్ కోర్సు ఆన్ కాంకరంట్ ఆడిట్ ఆఫ్ బ్యాంక్స్

 3. 50 గంటల నిడివి గల కోర్సు - ఐసీఏఐ రిజిష్టర్డ్ వాల్యూర్స్ ఆర్గనైజేషన్ ఫర్ ద అసెట్ క్లాస్ - సెక్యూరిటీస్/ ఫైనాన్షియల్ అసెట్స్
 వివరాలను https://learning.icai.org సైట్ నుంచి పొందవచ్చు

Popular posts from this blog

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

🌏 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 28