చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 18

సంఘటనలు

1930 : భారత స్వాతంత్ర్యోద్యమము: 1930 ఏప్రిల్ 18 తారీకున సూర్య సేన్ ఇతర విప్లవకారులతో కలిసి మందుగుండు, ఆయుధాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ సమాచార వ్వవస్థను విచ్ఛిన్నం చేసి ప్రాంతీయ ప్రభుత్వాన్ని ఏర్పరుచుటకై చిట్టగాంగ్ లోని ఆయుధాగారాన్ని ముట్టడించారు.

1923: అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో అన్నవరం పోలీస్ స్టేషన్‌పై దాడి జరిగింది.


జననాలు


1774: సవాయ్ మాధవ రావ్ II నారాయణ్ మరాఠా సామ్రాజ్యంలో 14వ పేష్వా (మ.1795).

1809: అధ్యాపకుడు, పండితుడు, కవి హెన్రీ డెరోజియో జననం (మ.1831).

1880: టేకుమళ్ళ అచ్యుతరావు, విమర్శకులు, పండితులు. (మ.1947)

1938: అత్తిలి కృష్ణారావు, వీధి నాటక రచయిత. (మ.1998)

1958: మాల్కం మార్షల్, వెస్టీండీస్ క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.


మరణాలు


1859: తాంతియా తోపే, భారత స్వాతంత్ర్యోద్యమకారుడు. (జ. 1814)

1955: ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, శాస్త్రవేత్త. (జ. 1879)

1974: గడిలింగన్న గౌడ్, కర్నూలు నియోజకవర్గపు భారతదేశ పార్లమెంటు సభ్యుడు. (జ. 1908)

2015: శ్రీ, సంగీత దర్శకుడు, గాయకుడు. (జ. 1966)

2016: దండి భాస్కర్ సీ పి ఐ రాష్ట్ర కార్యదర్శి, వార్తా దినపత్రిక జర్నలిస్ట్.


జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు 


ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం.

అంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవం (ప్రపంచ వారసత్వ దినోత్సవం).

Popular posts from this blog

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

🌏 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 28