Posts

Showing posts from April, 2020

తెలంగాణలో కరోనా: రెడ్‌ జోన్‌లోకి ఆరు జిల్లాలు

 తెలంగాణలో కరోనా వ్యాప్తిని బట్టి రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్ల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,038 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 28 మంది మృతి చెందారు. రెడ్‌ జోన్‌ జిల్లాలు  : హైదరాబాద్‌, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌, వరంగల్‌ అర్బన్ ఆరెంజ్‌ జోన్‌ జిల్లాలు : నిజామాబాద్‌, గద్వాల, నిర్మల్‌, నల్గొండ, ఆదిలాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, కుమ్రం భీం, ఆసిఫాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌, భూపాలపల్లి, మెదక్‌, జనగామ, నారాయణ పేట, మంచిర్యాల గ్రీన్‌ జోన్‌ జిల్లాలు : పెద్దపల్లి, నాగర్‌ కర్నూల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, సిద్దిపేట, వరంగల్‌ రూరల్, వనపర్తి, యాదాద్రి

ఐఐటీ పరీక్షలు భౌతిక దూరం..

 ఐఐటీ మద్రాస్, కాన్పూర్, ఖరగ్ పూర్, రోపర్, రూర్కీ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం పరీక్షలను భౌతిక దూరం పాటిస్తూ నిర్వహించా లని నిర్ణయించాయి. పరీక్ష కేంద్రంలో 30 శాతం విద్యార్థులు మాత్రమే ఉంటారు. ఐఐటీ గాంధీనగర్ ఆన్లైన్ కోర్సులు..  ఐఐటీ గాంధీనగర్ ఆన్ లైన్ కోర్సులు ప్రారంభించింది. 180 కోర్సులను ఈ విధానంలో బోధిస్తుంది.మరిన్ని వివరాలను  http://www.iitgn.ac.in/academics/online_courses   వెబ్ సైట్ లో   తెలుసుకోవచ్చు.

ఎన్టీఏ పరీక్ష'ల గడువు పెంపు: ఓపెన్ మ్యాట్

 నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించే ఓపెన్ మ్యాట కు దరఖాస్తు చేసుకునేందుకు నిర్దేశించిన గడువును మే 15 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫర్ చేసే పిహెచ్డి, ఓపెన్ మ్యాట్ (ఎంబిఎ)6 దేశానికి ఈ టెస్టులో అర్హత సాధించాలి. www.ignouexams.nta.nic . దరఖాస్తు చేసుకోవాలి. అలాగే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ జెఇఇ 2020, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసిఎఆర్) 2020, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎంట్రెన్స్ ఎగ్జామినే షన్ (జెఎన్యూ ఇఇ) కు మే 15 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలిండియా ఆయుష్ పీజీ ఎంట్రెన్స్ టెస్ట్ కు గడువును జూన్ 5 వరకు పొడిగించారు. సెంట్రల్ వర్సిటీ సెట్ గడువు పొడిగింపు... దేశవ్యాప్తంగా ఉన్న 14 సెంట్రల్ యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్న వివిధ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు ప్రవేశానికి ఉద్దే శించిన ఉమ్మడి టెస్టు దరఖాస్తు ప్రక్రియ ఆరంభమైంది. 'సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (సియుసిఇటి) 2020కి మే 23 లోపు దరఖాస్తు చేసుకోవాలి .www.cucetexam.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సీఏ

సెట్స్‌’ గడువు మళ్లీ పెంపు

మే 15 వరకు పొడిగించిన ఉన్నత విద్యామండలి  కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్‌) దరఖాస్తుల గడువును మరోసారి ఉన్నత విద్యామండలి పొడిగించింది. ఎంసెట్‌ సహా అన్ని సెట్స్‌ దరఖాస్తుల గడువును మే 15 వరకు పొడిగించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. లాక్‌డౌన్‌ కారణంగా విద్యాసంస్థలు, ఇంటర్నెట్‌ సెంటర్లు బంద్‌ కావడంతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో దరఖాస్తుల గడువును మొదట మే 7 వరకు పొడిగించగా మే 7 తరువాత కూడా లాక్‌డౌన్‌ ఎత్తేసే పరిస్థితి కనిపించని నేపథ్యంలో మే 15 వరకు దరఖాస్తుల గడువును ఉన్నత విద్యామండలి పొడిగించింది. మరోవైపు మే 15 తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తివేసినా పరీక్షల నిర్వహణకు అవసరమైన కేంద్రాల గుర్తింపు, నిర్వహణ సంస్థ చేయాల్సిన ఆన్‌లైన్‌ పరీక్షల ఏర్పాట్లకు సమయం పట్టనుంది. అలాగే విద్యార్థుల ప్రిపరేషన్‌కు సమయం ఇవ్వాల్సి వస్తుంది. పైగా హాస్టళ్లు ఓపెన్‌ చేయాల్సి ఉంటుంది. షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌లో దరఖాస్తుల గడువు ముగిసి మే 2న ఈసెట్, 5 నుంచి ఎంసెట్‌ ఆ తర్వాత నుంచి ఇతర సెట్స్‌ ప్రవేశ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంద

మేడే గురించి ప్రత్యేక కథనం

Image
మే దినోత్సవం మే దినోత్సవం లేదా మే డే (May Day) ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం. ప్రజా శెలవుదినం. చాలా దేశాలలో మే దినం, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా కార్మిక దినోత్సవంతో ఏకీభవిస్తాయి. ఇవి అన్నీ కూడా కార్మికుల పోరాటం, కార్మికుల ఐక్యతను గుర్తిస్తాయి. త్వరిత వాస్తవాలు: జరుపుకొనే రోజు, అనుకూలనం … కొన్ని పురాణగాథలు కొన్ని రోజులను పండుగలుగా మార్చాయి. కొన్ని జాతీయ సంఘటనలు ఆ సమాజానికి పర్వదినాలు అవుతాయి. కొందరు మహనీయులు తమ రక్తాన్ని చిందించి కొన్ని రోజులను చారిత్రాత్మక రోజులుగా మారుస్తారు. మే డే ఒక చారిత్రాత్మక చైతన్య దినం. చికాగోలో వున్న కొంతమంది రక్తతర్పణం చేసి కేవలం తమ దేశంలో వుండే కార్మికవర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారు. ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేమూ మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులుంటాయి. ఈ చాకిరీ మేం చేయలేమని పని ముట్లు కింద పడేసి ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడటం, చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించడం కార్మిక వర్గ పోరాట పటిమకు నిదర్శనం. 24 గంటలలో ఎనిమిది గంటలు పని, ఎనిమిది గంటలు విశ్రాంతి (రెస్టు), ఇంక

🌏 చరిత్రలో ఈరోజు మే 1

సంఘటనలు 1006: లూపస్ అనే రాశి లో, చైనీయులు, ఈజిప్షియనులు, సూపర్ నోవా (పేలిపోతున్న నక్షత్రం) ను గమనించారు. 1544: హంగరీని టర్కీ దేశ సైన్యం ఆక్రమించింది. 1682: పారిస్ వేధశాల (నక్షత్రాలను, గ్రహాలను గమనించే ప్రయోగశాల - అబ్జర్వేటరీ) ను, లూయి 15 అతని సభలోని సభ్యులు ప్రారంభించారు. 1704: మొట్టమొదటి 'వ్యాపార ప్రకటన' బోస్టన్ న్యూస్ లెటర్ లో ప్రచురితమైంది. 1707: ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్ కలిసి పోయి 'యునైటెడ్ కింగ్ డం ఆఫ్ గ్రేట్ బ్రిటన్' గా ఏర్పడింది. 1751: మొట్టమొదటి అమెరికన్ క్రికెట్ పోటీ జరిగింది. 1898: డేవీ డే (మనీలా బే యుద్ధం) (అమెరికాలో) 1906: మే డే కోసం జరుపుతున్న ఆందోళనలో, పారిస్ దళలు చాలామందిని నిర్బంధించాయి (ఆరెస్టు). 1925: సైప్రస్ దీవి బ్రిటిష్ వలసగా మారిన రోజు. 1931: న్యూయార్క్ లోని ఎంపైర్ బిల్డింగ్ పూర్తి అయిన రోజు. 1954: రెండవ ఆసియా క్రీడలు మనీలాలో ప్రారంభమయ్యాయి. 1960: గారీ పవర్స్, అమెరికాకు చెందిన గూధచారి విమానం యు2 లో ప్రయాణిస్తున్నసమయంలో యు.ఎస్.ఎస్.ఆర్ (పాత రష్యన్ దేశం), ఆ విమానాన్ని కూల్చి, అతనిని బందీగా పట్టుకుంది. 1960: డెన్మార్క్ లో, లీగో లే

1500 పోస్టల్ డిపార్ట్మెంట్ లో తీసుకొన వారి లిస్ట్

పోస్టల్ డిపార్ట్మెంట్ లో  1500 తీసుకొ న  వారి లిస్ట్ Click below link https://telanganapostalcircle.in/fsc/benfilist.aspx

GK

1) మూసీనదికి మరో పేరు? జ: మూచుకుంద Another name for the river of moosi? Ans: Musinuru 2) వైరా, ఆకేరు అనేవి ఏ నదికి ఉపనదుల? జ: మున్నేరు Vira and Akeru are tributaries of which river? Ans: Munneru 3) కడెం నది జన్మస్థానం ఏది?  జ: బోతాయి గ్రామం  (ఆదిలాబాద్ జిల్లా బజర్‌హత్‌నూర్ సమీపంలో) Which is the origin of the Kadem River?  Ans: Bothaai village (Adilabad district near Bazarhatnur) 4) హిమాయత్ సాగర్ రిజర్వాయర్‌ను నిర్మించింది ఎవరు?  జ: మీర్ ఉస్మాన్ అలీఖాన్ Who built the Himayat Sagar Reservoir? Ans: Mir Osman Ali Khan 5) గోదావరి, మంజీరా నదులు ఏ నదితో కలిసి ‘త్రివేణి సంగమం’ ఏర్పరుస్తున్నాయి? జ: హరిద్ర Godavari and Manjira rivers form the 'Triveni Sangam' with which river? Ans: Haridra 6) చిత్రకూట్ జలపాతం ఏ నదిపై ఉంది? జ: ఇంద్రావతి On which river is Chitrakoot Falls located? Ans: Indravati 7) దిండి నదికి మరో పేరేమిటి? జ: మీనాంబరం (దుందీభీ) What is the another name of the river Dindi? Ans: Meenambaram (Dundubhi) 8) ఏ నదుల కలయిక వల్ల ప్రాణహిత

ప్రజా రవాణా మొదలైతేనే 'పది' పరీక్షలు

విద్యాశాఖ అధికారుల అంచనా     లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ప్రజా రవాణాకుప్రభుత్వం అనుమతి ఇస్తేనే పదో తరగతి పరీక్షల నిర్వహణ సాధ్యమవుతుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. మే 7వ తేదీ వరకు లాక్డౌన్ అమల్లో ఉన్నందున ఆ తర్వాత పరిస్థితిని బట్టి పరీక్షల తేదీలను ప్రకటిస్తామని చెబుతున్నారు. ఉన్నత విద్య పరీక్షల పై యూజీసీ కమిటీ సైతంలాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కొంత కాలంపాటు భౌతిక దూరం పాటించాలని సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో పరీక్షల విధానంలో మార్పులకుప్రత్యామ్నాయ మార్గాలను నిపుణులు ప్రతిపాదిస్తున్నారు 10 మరియు12తరగతుల పరీక్షలు నిర్వహిస్తాం: సీబీఎస్ఈ      లాక్ డౌన్ ఆంక్షల కారణంగా నిర్వహించలేకపోయిన 10,12 తరగతుల పరీక్షలను సాధ్యమైనంత త్వరగా నిర్వహిస్తామని సీబీఎస్ఈ అధికారులు స్పష్టం చేశారు. లాక్ డౌన్ ముగిసిన వెంటనేఈ తరగతులకు సంబంధించిన ముఖ్యమైన 29సబ్జెక్టులకు పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లుచేసినట్లు తెలిపారు

పాలిసెట్‌ దరఖాస్తుల గడువు

0మే 9 వరకు పెంపు తెలంగాణ పాలిసెట్‌కు ఆలస్య రుసుం లేకుండా మే 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (ఎస్‌బీటెట్‌) సంచాలకుడు యూవీఎస్‌ఎన్‌ మూర్తి తెలిపారు. ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు లేటరల్‌ ఎంట్రీ ద్వారా పాలిటెక్నిక్‌ ద్వితీయ సంవత్సరంలోకి ప్రవేశించేందుకు నిర్వహించనున్న ఎల్‌పీ సెట్‌కు దరఖాస్తుల గడువును మే 11 వరకు పొడిగించినట్లు ఆయన పేర్కొన్నారు.

'జూమ్‌'లో డిజిటల్‌ తరగతులొద్దు

విద్యార్థులు లైంగిక వేధింపులకు గురయ్యే ప్రమాదం.. ఆ యాప్‌ వాడితే యాజమాన్యాలపై కేసులు పెట్టాలి ప్రభుత్వానికి జాతీయ బాలల హక్కుల కమిషన్‌ ఆదేశం కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు వీడియో కాన్ఫరెన్స్‌ యాప్‌ జూమ్‌లో పాఠశాల విద్యార్థులకు డిజిటల్‌ తరగతులు నిర్వహించవద్దని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.ఈ యాప్‌ విద్యార్థులకు ఏ మాత్రం సురక్షితం కాదని, వారు లైంగిక వేధింపులకు గురయ్యే ప్రమాదముందని హెచ్చరించింది.  విద్యార్థులకు రక్షణ లేకుండా డిజిటల్‌ తరగతులు నిర్వహిస్తే జస్టిస్‌ జువనైల్‌ యాక్ట్‌-2015లోని సెక్షన్‌ 70 ప్రకారం పాఠశాలల యాజమాన్యాలపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. జూమ్‌ యాప్‌ను వినియోగించవద్దని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా కొన్ని పాఠశాలల యాజమాన్యాలు ఇప్పటికీ వాడుతున్నాయని కొందరు తల్లిదండ్రులు తమకు ఫిర్యాదు చేశారని తెలిపింది. పాఠశాల విద్యార్థులకు డిజిటల్‌ తరగతుల నిర్వహణపై రాష్ర్టాల విద్యా శాఖలకు బాలల హక్కుల కమిషన్‌ కొన్ని మార్గదర్శకాలను రూపొందించి విడుదల చేసింది.పాఠశాలల్లో జూమ్‌ యాప్‌లో బోధించే డిజిటల్‌ తరగతులను ప

ఆగస్టు 1 నుంచి కొత్త విద్యాసంవత్సరం

వర్సిటీలు, జాతీయ విద్యాసంస్థలకు వర్తింపు కేంద్ర ప్రభుత్వానికి యూజీసీ సిఫారసులు సెప్టెంబర్‌ 1 నుంచి మొదటి ఏడాది తరగతులు ఆగస్టు 31 వరకు అడ్మిషన్లు 2021 జనవరి, మేలలో సెమిస్టర్‌ పరీక్షలు జూలై 1 నుంచి నెలరోజులు సెలవులు కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆగస్టు 1నుంచి నూతనవిద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలని యూనివర్సిటీల గ్రాంట్ల కమిషన్‌ (యూజీసీ).. కేంద్ర ప్రభుత్వానికి సిఫారసుచేసింది.  దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలు, జాతీయ విద్యాసంస్థలకు వర్తింపజేయాలని కోరింది.  ఆగస్టు 1 నుంచి ద్వితీయ సంవత్సరం తరగతులు, సెప్టెంబర్‌ 1 నుంచి తొలి సంవత్సరం తరగతులను ప్రారంభించాలని పేర్కొన్నది. ఆగస్టు 31 వరకు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తిచేయాలని సూచించింది  యూజీసీ సిఫారసుల మేరకు 2021 జనవరి 1 నుంచి 25 వరకు మొదటి సెమిస్టర్‌, మే 26 నుంచి జూన్‌ 25 వరకు రెండో సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది  2021 జూలై 1 నుంచి 30 వరకు వేసవి సెలవులు ప్రకటించాలి.  2019-20  ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రకారం..  ఈ ఏడాది జనవరిలో సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించారు కొవిడ్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 16 న

🌏 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 30

సంఘటనలు 1946: మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పదవి చేపట్టాడు. 1975: దక్షిణ వియత్నాం (సైగాన్) ఉత్తర వియత్నాం దేశానికి లొంగిపోయి వియత్నాం యుద్ధానికి ముగుంపు పలికింది. 1986: ఐ.ఎన్.ఎస్. సింధుఘోష్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు. జననాలు 1777: కార్ల్ ఫ్రెడ్రిచ్ గాస్, జర్మన్ గణిత శాస్త్రవేత్త. (మ.1855) 1870: దాదాసాహెబ్ ఫాల్కే, చలనచిత్ర దర్శకుడు. (మ.1944) 1891: గాడేపల్లి వీరరాఘవశాస్త్రి, గొప్ప కవి. శతావధాని, నాటకాలంకార సాహిత్యగ్రంథాలను పూర్తిచేశాడు. అష్టావధానాలు, శతావధానాలు అటు గద్వాల మొదలుకొని ఇటు మద్రాసు వరకు లెక్కకు మించి చేశాడు. 1901: సైమన్ కుజ్‌నెట్స్, ఆర్థికవేత్త . 1902: థియోడర్ షుల్జ్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత . 1910: శ్రీశ్రీ, తెలుగు జాతి గర్వించే మహాకవి, ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి. (మ.1983) 1926: శ్రీనివాస్ ఖాలె, భారత సంగీత దర్శకుడు, (మహారాష్ట్ర) (మ.2011) 1968: దాడిచిలుక వీర గౌరీశంకర రావు, మత్తుమందు వైద్యుడు, రాజకీయ నాయకుడు. 1987 : రోహిత్ శర్మ, భారత దేశ క్రికెట్ క్రీడాకారుడు.

🌏 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 28

సంఘటనలు 1916:మహారాష్ట్ర లో పూనాలో బాలగంగాధర్ తిలక్ హోంరూల్ లీగ్ స్థాపించాడు. 2001: డెన్నిస్ టిటో, ప్రపంచంలో మొదటి అంతరిక్ష పర్యాటకుడుగా చరిత్రలో నిలిచాడు. జననాలు 1758: జేమ్స్ మన్రో, అమెరికా రాజకీయవేత్త, 5 వ అధ్యక్షుడు. (మ.1831) 1871: కాళ్ళకూరి నారాయణరావు, సుప్రసిద్ధ నాటక కర్త, సంఘ సంస్కర్త, ప్రథమాంధ్ర ప్రచురణ కర్త, జాతీయవాది, ఛాయా గ్రహణ వాద్యాదురంధరుడు. (మ.1927) 1897: భమిడిపాటి కామేశ్వరరావు, ప్రముఖ రచయిత, నటుడు, నాటక కర్త. (మ.1958) 1924: కెన్నెథ్ కౌండా, జింబాబ్వే మొదటి అధ్యక్షుడు. 1942: ఎ.జి.కృష్ణమూర్తి, ప్రముఖ అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ ముద్రా కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు (మ.2016) 1947: గంటి ప్రసాదం, నక్సలైటు నాయకుడుగా మరిన కవి. 1947: హుమాయున్ ఆజాద్, బంగ్లాదేశ్ రచయిత. 1987: సమంత, తెలుగు, తమిళ భాషల్లో నటించిన భారతీయ నటి. మరణాలు 1740: పేష్వా బాజీరావ్ I మరాఠా సామ్రాజ్యానికి చెందిన 6వ పేష్వా. (జ.1700) 1945: ముస్సోలినీ, ఇటలీకి చెందిన ఒక రాజకీయ నాయకుడు. (జ.1883) 1978: మహమ్మద్ డౌద్ ఖాన్, ఆఫ్ఘనిస్థాన్ మొదటి అధ్యక్షుడు. (జ. 1909) 1987 : ప్రజా సేవకులు, విద్యా సం

తెలంగాణ లో ఎడ్యుకేషన్ దరఖాస్తులకు చివరి తేదీలు

తెలంగాణ ఎడ్యుకేషన్ సర్కిల్  తెలంగాణ లో ఐసెట్ దరఖాస్తులకు  చివరి తేదీ 05/05/2020 తెలంగాణ  ఎంసెట్ అప్లికేషన్ లకు  చివరి తేదీ 05/05/2020 తెలంగాణ  పాలిటెక్నీక్  అప్లికేషన్ లకు  చివరి తేదీ 30/04/2020 తెలంగాణ బి ఈ డి ( EDSET ) అప్లికేషన్ లకు చివరి తేదీ 05/05/2020 తెలంగాణ లా సెట్  అప్లికేషన్ లకు  చివరి తేదీ 05/05/2020 తెలంగాణ డీ ఈడీ  అప్లికేషన్ లకు  చివరి తేదీ 27/04/2020 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీజీ చివరి తేదీ 22/05/2020 CENTRAL UNIVERSITIES COMMON ENTRANCE TEST (CUCET-2020)అప్లికేషన్ లకు    చివరి తేదీ 23/05/2020  TELANGANA RESIDENTIAL EDUCATIONAL  గురుకుల  ఇంటర్ ప్రవేశాలకు చివరి తేదీ 01/05/2020 MAHATMA JYOTIBA PHULE  RESIDENTIAL EDUCATIONAL గురుకుల  ఇంటర్ ప్రవేశాలకు  చివరి తేదీ 10/05/2020 MAHATMA JYOTIBA PHULE  RESIDENTIAL EDUCATIONAL గురుకుల  డిగ్రీ  ప్రవేశాలకు చివరి తేదీ 10/05/2020..          

రేషన్‌ తీసుకోని వారికి రూ.1,500 సాయం నిలిపివేత

హైదరాబాద్‌: ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు వరుసగా కనీసంగా 4.50 లక్షల మంది లబ్ధిదారులు కార్డు ఉండికూడా రేషన్‌ తీసుకోవడం లేదని పౌరసరఫరాల శాఖ గుర్తించింది. వారికి ప్రభుత్వం తరఫున అందిస్తున్న రూ.1,500 సాయాన్ని నిలిపివేసింది. దీనిద్వారా పౌర సరఫరాల శాఖకు రూ.67 కోట్ల మేర మిగులు వచ్చింది. రాష్ట్రంలో 87.54 లక్షల కుటుంబాలు ఉండగా, 3 నెలలుగా రేషన్‌ తీసుకోని కుటుంబాల సంఖ్య ఒక్కో నెల ఒక్కోలా ఉంది. కాగా, రేషన్‌కార్డుదారుల కుటుంబాలకు కరోనా నేపథ్యంలో ప్రభుత్వం నెలకు రూ.1,500 ఆర్థికసాయాన్ని అందిస్తోంది. తొలి విడతలో 74లక్షల మందికి, రెండో విడతలో 5.21 లక్షల మందికి పంపిణీ చేస్తోంది. మూడో విడతలో మరో 3లక్షల మందికి రూ.45 కోట్లు ఇచ్చేందుకు సిద్ధం కాగా, మరో లక్ష కుటుంబాలకి బ్యాంకు ల్లో డబ్బులు వేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కుటుంబాలన్నీ పోనూ మరో 4.50 లక్షలమంది కుటుంబాలు పూర్తిగా రేషన్‌ తీసుకోనివే. వీరికి రూ.1,500 ఇవ్వకూడదని నిర్ణయించినట్లు తెలిసింది. రేషన్‌ బియ్యం వీ రి కి అవసరం లేనప్పుడు ప్రభుత్వ సాయం అనవసరమనే భావిం చాల్సి ఉంటుందని పౌర సరఫరాల శాఖ అధికారి ఒకరు వెల్లడించారు.

Covid 19 in Telangana (Updated on 27.04.2020)

Image

డీసెట్‌ గడువు మే 15 వరకు పొడిగింపు

డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(డీఈడీ), డిప్లొమా ఇన్‌ ప్రీస్కూల్‌ ఎడ్యుకేషన్‌ (డీపీఎ్‌సఈ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే డీసెట్‌-2020 దరఖాస్తు గడువును మే 15 వరకు పొడిగించినట్టు సెట్‌ కన్వీనర్‌ కృష్ణారావు తెలిపారు.  డీసెట్‌ వెబ్‌సైట్‌ http://deecet.cdse.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. *మే 22న డీఈఈ సెట్‌.. 11 నుంచి దరఖాస్తులు:* హైదరాబాద్‌: వచ్చే విద్యా సంవత్సరం (2020-21) డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఎడ్‌), డిప్లొమా ఇన్‌ ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (డీపీఎస్‌ఈ) కోర్సుల్లో ప్రవేశానికి డీఈఈసెట్‌ను మే 22న నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో సమావేశమైన కమిటీ డీఈఈసెట్‌ కాలపట్టికను ఖరారు చేసింది.. 

GK

1) ఏ దేశ జీపీఎస్ వ్యవస్థను ‘క్వాసీజెనిథ్’ అని పిలుస్తారు? జ: జపాన్. 1)Which country's GPS system is called 'quasigenath'? Ans:Japan. 2)కోతకు ముందే పంట దిగుబడిని అంచనావేసే ఏ కార్యక్రమాన్ని ఇస్రో ఉపగ్రహాల ద్వారా నిర్వహిస్తుంది? జ: ఫసల్.  2)Which program is operated by ISRO satellites to predict crop yields before harvest? Ans: Fasal. 3)సూర్యుని అధ్యయనానికి ఇటీవల నాసా ప్రయోగించిన ఉపగ్రహం ఏది? జ: పార్కర్ సోలార్ ప్రోబ్. 3)Which satellite was recently launched by NASA for the study of the sun? Ans: Parker Solar Probe. 4)అంతరిక్ష నౌకల, ఉపగ్రహాల నిర్మాణంలో ఉపయోగపడే ఏ అడ్‌హెసివ్‌ను ఇస్రో ప్రయోగించింది? జ: EPY1061 4)ISRO launches which adhesive used in the construction of space ships and satellites?   Ans: EPY1061 5)క్రయోజెనిక్ ఇంజిన్‌లో ఉపయోగించే ఇంధనం ఏమిటి? జ: ద్రవ హైడ్రోజన్. 5)What is the fuel used in the cryogenic engine? Ans: liquid hydrogen. 6)PSLV-C37 ద్వారా ఇస్రో ప్రయోగించిన అల్‌ఫరాబి-1 అనే ఉపగ్రహం ఏ దేశానికి చెందింది? జ:  క

About Telangana (మన తెలంగాణ స్పెషల్)

Image
మన తెలంగాణ స్పెషల్  (లైఫ్ సైన్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా).. ..2020 *రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం.     :        2 / జూన్ / 2014. *రాజధాని--                              :        హైదరాబాద్ *అతిపెద్ద నగరం -                      :         హైదరాబాద్ *సిఎం--                                     :         కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు *గవర్నర్                                    :          తమిళైసాయి సౌండ్‌రాజన్ *హై కోర్టు జడ్జి                             :             విజయసేన్‌ రెడ్డి *భాషలు                                     :            తెలుగు, హిందీ,  ఉర్దూ *నేషనల్ పార్క్                             :            ముర్గావణి ,కసు భ్రమ్నంద రెడ్డి, మహావీర్ ముర్గావణి *వైల్డ్ లైఫ్ ‌అభయారణ్యం                 :                కావల్పా,ఖల్,మంజిరా *ఫోక్ డాన్స్ లు                               :                  పెరిని శివతండవం , పెరిని తాండవం *డ్యామ్స్                                        :             నాగర్జున్ - కృష్ణ,నిజాం సాగర్ --- మంజీరా,కదమ్-- కదమ్                         

🌎 చరిత్రలో ఈ రోజు ఏప్రిల్ 27

 సంఘటనలు 1908: నాలుగవ ఒలింపిక్ క్రీడలు లండన్లో ప్రారంభమయ్యాయి. 1961: సియర్రా లియోన్ దేశానికి స్వతంత్రం లభించింది. 1994: దక్షిణ ఆఫ్రికా దేశానికి స్వతంత్రం లభించింది. 2001: తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటయింది.  జననాలు 1791: శామ్యూల్ మోర్స్, అమెరికన్ ఆవిష్కర్త, చిత్రకారుడు, మోర్స్ కోడ్ ఆవిష్కర్త, (మ. 1872) 1820: హెర్బర్ట్ స్పెన్సర్ విక్టోరియన్ శకానికి చెందిన ఒక ఆంగ్లభాషా తత్వజ్ఞుడు, జీవశాస్త్రజ్ఞుడు, సమాజశాస్త్రజ్ఞుడు, సాంప్రదాయకమైన ఉదారవాద రాజకీయ సిద్ధాంతవాది. (మ.1903) 1955: గూగుల్ ఛైర్మన్/CEO ఎరిక్ ఇ. ష్మిత్ జననం.  మరణాలు ◾1974: ప్రముఖ తెలుగు సినిమా నటి శ్రీరంజని (జూనియర్) మరణం. ◾1989: తమనపల్లి అమృతరావు, తొలినాటి నుండి మధ్యనిషేధం అమలుపై తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. 1956లో ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి మధ్య నిషేధ కార్యకర్తల మండలికి సభ్యులయ్యారు. ◾2004: శంకరాభరణం శంకరశాస్త్రిగా పేరుగాంచిన నటుడు జె.వి. సోమయాజులు మరణం. ◾2009: ఫిరోజ్ ఖాన్, హిందీ సినిమా నటుడు. (జ.1939) ◾2017: విను చక్రవర్తి, తమిళ హాస్యనటుడు, సినీ రచయిత, దర్శకుడు (జ.1945) ◾2017: వినోద్ ఖన్నా బాలీవుడ్ నటుడు,

Covid 19 in Telangana (Updated on 26.04.2020)

Image

🌎చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 26

సంఘటనలు 1916 : అల్లూరి సీతారామరాజు ఉత్తరభారతదేశ యాత్రకు బయలుదేరాడు. 1986 : అత్యంత ప్రమాదకరమైన సంఘటన చెర్నొబైల్ అణువిద్యుత్ కేంద్రంలో జరిగింది. 2012 : హైదరాబాదులో మెట్రోరైలు పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. జననాలు 570: మహమ్మదు ప్రవక్త, ఇస్లాం మతస్థాపకుడు (మ. 632) 1762: శ్యామశాస్త్రి, కర్ణాటక సంగీత విద్వాంసులు, వాగ్గేయకారులు, సంగీత త్రిమూర్తులలో మూడవవాడు. (మ.1827) 1931: గణపతి స్థపతి స్థపతి, వాస్తుశిల్పి. (మ.2017) ) 1942: కాకాని చక్రపాణి, కథారచయిత, నవలాకారుడు, అనువాదకుడు. (మ.2017) 1955: కొమరవోలు శివప్రసాద్, సంగీతకారులు ఈలపాటలో పేరొందినవారు. మరణాలు 1748: మొహమ్మద్ షా 12వ మొఘల్ చక్రవర్తి (జ.1702) 1920: శ్రీనివాస రామానుజన్, భారతీయ గణితవేత్త. 1987: శంకర్, సంగీత దర్శకుల ద్వయం శంకర్ జైకిషన్. జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు  ప్రపంచ మేధోసంపత్తి దినోత్సవం.

GK

1) భారత్ లో కరోనా ఫ్రీ రాష్ట్రంగా నిలిచిన మొదటి రాష్ట్రం ఏది? A: *గోవా* 2) అంతర్జాతీయ నీటి దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? A: *మార్చి 22* 3) ఇటీవల జననీ, వృంధా వీరు వార్తల్లో నిలవడానికి కారణం ఏమిటి? A: *ICC అంతర్జాతీయ ప్యానెల్ లో చోటు దక్కించుకున్న భారతీయ మహిళా అంపైర్లు* 4) ఒమన్ ఓపెన్  టేబుల్ టెన్నిస్ టోర్నీ విజేత ఎవరు? A: *శరత్ కుమార్(భారత్)* 5) CAA కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం ఏ రోజున అసెంబ్లీ తీర్మాణం చేసింది? A: *మార్చి 16*

ఓయూ డిగ్రీ, పీజీ కోర్సుల పరీక్షా ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ డిగ్రీ, పీజీ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ది ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీఎస్‌డబ్ల్యూ తదితర కోర్సుల మొదటి, మూడో, అయిదో సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షల రివాల్యుయేషన్‌ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్‌ www.osmania.ac.in లో ఉంచినట్లు ఆయన చెప్పారు.                   ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, హిస్టరీ, ఇంగ్లీష్‌, ఆర్కియాలజీ, ఉర్దూ, పర్షియన్‌, ఫిలాసఫీ, మరాఠీ విభాగాల్లో ఎంఏ, ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్‌, ఎంకాం ప్రధమ సెమిస్టర్‌ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ లో కరోనా రేషన్ నగదు 💰1,500 /- రూపాయలు అకౌంట్ లో ఎప్పుడు పడినవో చూడడానికి

Image
తెలంగాణ లో కరోనా రేషన్ నగదు 💰1,500 /- రూపాయలు అకౌంట్ లో  ఎప్పుడు  పడినవో చూడడానికి. మీ యొక్క  రేషన్ కార్డు నెంబర్ తో చెక్ చేసుకోగలరు. ఈ లింక్ ఓపెన్ చేయండి Click here                                                             పై విధంగా వస్తుంది

రేషన్ కార్డు కి💰రూ. 1500/- ఏ బ్యాంక్ లో డబ్బులు పడనివారు

*రేషన్ కార్డు కి💰రూ. 1500/- ఏ బ్యాంక్ లో  డబ్బులు పడనివారు , పోస్ట్ ఆఫీస్ లో ఇస్తారు.* *వెంటనే మీ యొక్క  రేషన్ కార్డు నెంబర్ తో చెక్ చేసుకోగలరు..*   Click here

GK

1)మూసీనదికి మరో పేరు?        జ:మూచుకుంద. 1)Another name for the river of moose.? Ans:Musinuru. 2)వైరా, ఆకేరు అనేవి ఏ నదికి            ఉపనదులు?     జ:మున్నేరు. 2)Vira and Akeru are tributaries of which river? Ans: Munneru. 3)కడెం నది జన్మస్థానం ఏది?  జ:    బోతాయి  గ్రామం  (బజర్‌హత్‌నూర్ సమీపంలో ఆదిలాబాద్ జిల్లా)  . 3)Which is the origin of  the Kadem River?       Ans: Bothaai village( Adilabad district near Bazarhatnur). 4)హిమాయత్ సాగర్ రిజర్వాయర్‌ను నిర్మించింది ఎవరు?  జ:  మీర్ ఉస్మాన్ అలీఖాన్. 4)Who built the Himayat Sagar Reservoir? Ans: Mir Osman Ali Khan. 5)గోదావరి, మంజీరా నదులు ఏ నదితో కలిసి ‘త్రివేణి సంగమం’ ఏర్పరుస్తున్నాయి?       జ:హరిద్ర. 5)Godavari and Manjira rivers form the 'Triveni Sangam' with which river? Ans: Haridra. 6)చిత్రకూట్ జలపాతం ఏ నదిపై ఉంది? జ:  ఇంద్రావతి. 6)On which river is Chitrakoot Falls located? Ans:Indravati. 7)దిండి నదికి మరో పేరేమిటి? జ: మీనాంబరం.(దుందీభీ) 7)What is the another name of th

డిజిటల్‌ మోదీ! ‘ఈ-గ్రామ్‌ స్వరాజ్‌ ’ పోర్టల్‌ ప్రారంభం

📱మొబైల్‌ ఫోన్లలోనూ గ్రామ సమాచారం ‘స్వామిత్వ యోజన’ వెబ్‌సైట్‌ ప్రారంభం డ్రోన్ల ద్వారా గ్రామ ఆస్తుల సేకరణసర్పంచులతో ప్రధాని డిజిటల్‌ భేటీ కరోనా నేర్పిన పాఠం.. స్వావలంబన, న్యూఢిల్లీ,  దేశంలోని గ్రామాలన్నింటినీ డిజిటలీకరిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఓ భారీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘‘ఈ-గ్రామ స్వరాజ్‌ ’’ పేరిట పోర్టల్‌ను, యాప్‌ను, ‘స్వామిత్వ యోజన’ పేరిట వెబ్‌సైట్‌ను ఆయన ఆరంభించారు. పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన  దేశవ్యాప్తంగా సుమారు లక్ష మంది సర్పంచులతోనూ, గ్రామ సచివాలయ ప్రతినిధులతోనూ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంభాషించారు. గ్రామాల అభివృద్ధిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా ఆరంభించిన ఈ పోర్టల్‌ ద్వారా అన్ని పనులను ఎలకా్ట్రనిక్‌ మోడ్‌లో రికార్డు చేసి ఫోన్లలో అందుబాటులోకి తెస్తారు.   గ్రామాభివృద్ధి ప్రణాళిక రూపకల్పన, పనుల పురోగతి, వర్క్‌-బేస్డ్‌ అకౌంటింగ్‌ అన్నీ ఈ-గ్రామ స్వరాజ్‌ పోర్టల్‌ ద్వారా చేపట్టవచ్చు. పంచాయతీరాజ్‌ శాఖ రూపొందించిన ఈ పోర్టల్‌ ద్వారా గ్రామ సచివాలయాల కార్యకలాపాలు డిజిటల్‌ మోడ్‌లో నిర్వహించవచ్చు. గ్రామపంచాయతీ అభివృద్ధిని వికేంద్రీకరించి, దీని

డీసెట్‌ గడువు మే 15 వరకు పొడిగింపు

డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(డీఈడీ), డిప్లొమా ఇన్‌ ప్రీస్కూల్‌ ఎడ్యుకేషన్‌ (డీపీఎ్‌సఈ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే డీసెట్‌-2020 దరఖాస్తు గడువును మే 15 వరకు పొడిగించినట్టు సెట్‌ కన్వీనర్‌ కృష్ణారావు తెలిపారు.  డీసెట్‌ వెబ్‌సైట్‌  http://deecet.cdse.te langana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

🌏 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 25

సంఘటనలు 2007: నకిలీ పాసుపోర్టుల కుంభకోణంలో పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తెరాస అగ్రనేత ఆలె నరేంద్రను పార్టీ నుండి సస్పెండు చేసారు. 2011: 2011 ఏప్రిల్ 1 నుంచి 2011 ఏప్రిల్ 25 వరకు భారతదేశంలో, వెండి ధర 75,770 రూపాయలకు చేరి, రికార్డు స్థాపించింది. (1 ఏప్రిల్ నుంచి 2011 ఏప్రిల్ 25 వరకు ఉన్న 25 రోజులలో వెండి 31% ఎక్కువ పెరిగింది). ఈ నెలంతా, బంగారం, వెండ్ వ్యాపారులు వెండిని సరఫరా చేయలేక, ముందుగా కొంత డబ్బు కట్టించుకుని, వారం రోజుల తరువాత వెండిని ఇచ్చేవారు. జననాలు 1874: గూగ్లి ఎల్మో మార్కోని, రేడియో కనిపెట్టిన శాస్త్రవేత్త. (మ. 1937) 1900: వోల్ఫ్‌గాంగ్ ఎర్నస్ట్ పౌలీ, ఆస్ట్రేలియా భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ. 1958) 1974 : ప్రముఖ సినిమా నటి దివ్యభారతి జననం (మ.1993). మరణాలు 68: మార్క్ ద ఎవాంజెలిస్ట్, అలెగ్జాండ్రియా లోని మొదటి పోప్, అలెగ్జాండ్రియా చర్చి స్థాపకుడు. 1744: అండర్స్ సెల్సియస్ స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త. ఉష్ణోగ్రతయొక్క ఒక కొలమానాన్ని ఇతని పేరు మీద సెల్సియస్ అని పిలుస్తారు. (జ.1701) 1984: ముదిగొండ విశ్వనాధం, ప్రముఖ గణితశాస్త్రజ్ఞడు, శివపూ

🌏 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 24

సంఘటనలు 1704 : మొదటి వార్తాపత్రిక అమెరికా లోని బోస్టన్ నగరం నుండి ప్రారంభించబడింది. 1993: 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ వ్యవస్థ అమలులోకి వచ్చింది. 110 సంవత్సరాల క్రితం 1882 లో రిపన్ ప్రవేశపెట్టిన "స్థానిక ప్రభుత్వము" అనే ఆలోచన, 84 సంవత్సరాల తరువాత మహాత్మా గాంధీ కలలు కన్న 'గ్రామ స్వరాజ్యము' వాస్తవంగా అమలు లోకి వచ్చిన రోజు. 1967 : వ్లాదిమిర్ కొమరోవ్ అనే అంతరిక్ష శాస్త్రవేత్త పారాచూట్ తెరుచుకోకపోవటం వల్ల సూయజ్-1 లో మరణించాడు. ఇతడు అంతరిక్ష నౌకలో మరణించిన మొదటి వ్యక్తిగా నిలిచాడు. 1970 : చైనా పంపిన మొదటి ఉపగ్రహం, డాంగ్ ఫాంగ్ హాంగ్ 1 2005 : దక్షిణ కొరియాలో క్లోనింగ్ ప్రక్రియ ద్వారా జన్మించిన కుక్క, స్నప్పీ. జననాలు 1884: విస్సా అప్పారావు, మద్రాసు సంగీత అకాడమి మూలస్తంభాలలో ఒకరు. 1927: నండూరి రామమోహనరావు, తెలుగు పాత్రికేయుడు, అభ్యుదయవాది, ‘ఆంధ్రజ్యోతి’ పూర్వ సంపాదకుడు. (మ.2011) 1929: రాజ్‌కుమార్, భారత చలనచిత్ర నటుడు, గాయకుడు. (మ.2006) 1934: ఏడిద నాగేశ్వరరావు, తెలుగు సినిమా నిర్మాత. (మ.2015) 1941: షరాఫ్ తులసీ రామాచారి , పేరెన్నికగని, వేల కార్టూన్లను

IIT Hyderabad లో M.A

IIT Hyderabad లో లిబరల్ ఆర్ట్స్ విభాగంలో M.A.PROGRAM కు అడ్మిషన్. MA ప్రవేశానికి కనీస అర్హత ప్రమాణాలు  :  బ్యాచిలర్ డిగ్రీలో 55% మార్కులు లేదా సమానమైన సిజిపిఎ. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులు రాత పరీక్ష మరియు / లేదా లిబరల్ ఆర్ట్స్ విభాగం ద్వారా నిర్వహించిన ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించాలి. ఎంపిక : రాత పరీక్ష కోసం అర్హత ఆధారంగా అవసరమైన అభ్యర్థులను మాత్రమే పిలిచే హక్కు ఇన్స్టిట్యూట్కు ఉంది. చివరి తేదీ :   మే 1 (4pm) అప్లికేషన్  :   ఆన్‌లైన్ లో  ప్రోగ్రామ్ యొక్క వ్యవధి :  M.A. ప్రోగ్రామ్ యొక్క వ్యవధి 4 సెమిస్టర్లు (24 నెలలు), ఇందులో ఎంపికైన అభ్యర్థులు కోర్సు పనిని పూర్తి చేసి, ఒక వ్యాసం రాయాలి. అప్లికేషన్  :   Click here

SPRERI లో ఉద్యోగం

ఖాళీ స్థానం                                      :    సీనియర్ రీసెర్చ్ ఫెలో దరఖాస్తు గడువు                              :    25.04.2020 నోటిఫికేషన్                                      :       Click here వయోపరిమితి, జీతం,చదువు ,మరియు ఇతర వివరాలకోసం నోటిఫికేషన్ చదవండి.

BPPI అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మరియు వివిధ పోస్టులు

ఉద్యోగం                                          :      అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మరియు వివిధ పోస్ట్లు ఖాళీల సంఖ్య                                  :      5 ఉద్యోగ స్థానం                                   :     ఢిల్లీ దరఖాస్తు చేయడానికి చివరి తేదీ        :    30 ఏప్రిల్ 2020 నోటిఫికేషన్                                      :      Click here వయోపరిమితి, జీతం,చదువు ,మరియు ఇతర వివరాలకోసం నోటిఫికేషన్ చదవండి.

TS POLYCET 2020 registration deadline extended

TS POLYCET 2020 registration deadline extended till April The State Board of Technical Education and Training, Telangana has yet again extended the deadline to submit online applications for the Telangana Polytechnic Common Entrance Test (TS POLYCET) 2020 till April 30, 2020. A notice regarding this decision has been uploaded on the board’s official website. Candidates interested and eligible to appear in the TS POLYCET 2020 can apply online at polycetts.nic.in on or before the deadline without any late fees. The online registration process for the Common Entrance exam had started on March 2, 2020. For TS POLYCET previous papers, study material and model papers, click here  For more details, please visit Click here

COVID19 Update 22-04-2020

తెలంగాణ: ► తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 943కి చేరింది. ► తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 24 మంది మృతి చెందారు. ► తెలంగాణలో కరోనా నుంచి కోలుకుని 194 మంది డిశ్చార్జ్ అయ్యారు. ► తెలంగాణలో ప్రస్తుతం 725 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయం: ► దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 20,471కి చేరింది. ► దేశవ్యాప్తంగా కరోనాతో 652 మంది మృతి చెందారు. ► దేశంలో ప్రస్తుతం 15,859 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ► దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని 3,960 మంది డిశ్చార్జ్ అయ్యారు. అంతర్జాతీయం: ► ప్రపంచవ్యాప్తంగా 26 లక్షలు దాటిన కరోనా కేసులు ► ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 1.84 లక్షల మంది మృతి చెందారు. ► ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి 7.17 లక్షల మంది కోలుకున్నారు.

మే నెలలో పరీక్షలేం ఉండవు

♦️ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి స్పష్టీకరణ ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే మే నెలలో ఎలాంటి ప్రవేశ, సెమిస్టర్‌ పరీక్షలు ఉండవని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి స్పష్టం చేశారు. మే ఏడు వరకు లాక్‌డౌన్‌ ఉండటం, ఆపై పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చాక మూడు నాలుగు వారాల సమయం అవసరం అవుతున్నందున మే నెలలో ఎంసెట్‌, ఇతర ప్రవేశ పరీక్షలు, డిగ్రీ, ఇంజినీరింగ్‌ కోర్సులకు సంబంధించి సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించే అవకాశం లేదన్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేత అనంతరం సాధారణ పరిస్థితులను బట్టే పరీక్షల నిర్వహణ ఉంటుందని చెప్పారు. డిగ్రీ ఫలితాలతో ముడిపడి ఉన్న ప్రవేశ పరీక్షలను డిగ్రీ పరీక్షలయ్యాక జరుపుతామన్నారు. ముందుగా డిగ్రీతో సంబంధం లేని ఎంసెట్‌, ఈసెట్‌ను నిర్వహిస్తామన్నారు. డిగ్రీ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులను పరీక్షల ఫలితాలతో సంబంధం లేకుండా పై సెమిస్టర్‌కు అనుమతించాలని భావిస్తున్నామన్నారు. డిగ్రీ, ఇంజినీరింగ్‌ పరీక్షలకు సిలబస్‌ తగ్గించే ఆలోచన ఉందన్నారు. ఇప్పటివరకు పూర్తయిన పాఠ్యాంశాల పైనే పరీక్షలు జరుపుతామని పాపిరెడ్డి వివరించారు.

‘పది’ జవాబుపత్రాలు జాగ్రత్త

  పదో తరగతిలో రెండు సబ్జెక్టులకు సంబంధించి మూడు వార్షిక పరీక్షలు పూర్తయినందున మూల్యాంకన కేంద్రాల్లో ఉన్న వాటి జవాబుపత్రాలు దెబ్బతినకుండా జాగ్రత్తలుతీసుకోవాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ డీఈవోలను ఆదేశించారు. ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు సత్యనారాయణరెడ్డితో కలిసి ఆమె బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 🔹లాక్ డౌన్ తర్వాత పదోతరగతి పరీక్షలు!     లాక్డౌన్ సడలించిన తర్వాత పదో తరగతికిసంబంధించి మిగతా నాలుగు సబ్జెక్టులపరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ వెల్లడించారు. బుధవారం డీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.పాఠశాలల్లో ట్యూషన్ఫీజుపెంపుపైఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. 🔹జూన్లో ప్రవేశ పరీక్షలు! లాక్డౌనను మే నెలాఖరు వరకు పొడిగిస్తేఎంసెట్, ఈసెట్ వంటి ప్రవేశ పరీక్షలను జూన్మూడులేదానాలుగోవారానికివాయిదావేస్తామని ఉన్నత విద్యామండలిచైర్మన్ తుమ్మల పాపిరెడ్డి చెప్పారు. డిగ్రీలోడిటెన్షన్ విధానాన్ని రద్దుచేస్తూ వర్సిటీలకుఆదేశాలు జారీచేశామని బుధవారం మీడియాకు వెల్లడించారు. డిగ్రీ, పీజీ తదిత

🌏 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 23

సంఘటనలు 1704 : మొదటి వార్తాపత్రిక అమెరికా లోని బోస్టన్ నగరం నుండి ప్రారంభించబడింది. 1993: 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ వ్యవస్థ అమలులోకి వచ్చింది. 110 సంవత్సరాల క్రితం 1882 లో రిపన్ ప్రవేశపెట్టిన "స్థానిక ప్రభుత్వము" అనే ఆలోచన, 84 సంవత్సరాల తరువాత మహాత్మా గాంధీ కలలు కన్న 'గ్రామ స్వరాజ్యము' వాస్తవంగా అమలు లోకి వచ్చిన రోజు. 1967 : వ్లాదిమిర్ కొమరోవ్ అనే అంతరిక్ష శాస్త్రవేత్త పారాచూట్ తెరుచుకోకపోవటం వల్ల సూయజ్-1 లో మరణించాడు. ఇతడు అంతరిక్ష నౌకలో మరణించిన మొదటి వ్యక్తిగా నిలిచాడు. 1970 : చైనా పంపిన మొదటి ఉపగ్రహం, డాంగ్ ఫాంగ్ హాంగ్ 1 2005 : దక్షిణ కొరియాలో క్లోనింగ్ ప్రక్రియ ద్వారా జన్మించిన కుక్క, స్నప్పీ. జననాలు 1884: విస్సా అప్పారావు, మద్రాసు సంగీత అకాడమి మూలస్తంభాలలో ఒకరు. 1927: నండూరి రామమోహనరావు, తెలుగు పాత్రికేయుడు, అభ్యుదయవాది, ‘ఆంధ్రజ్యోతి’ పూర్వ సంపాదకుడు. (మ.2011) 1929: రాజ్‌కుమార్, భారత చలనచిత్ర నటుడు, గాయకుడు. (మ.2006) 1934: ఏడిద నాగేశ్వరరావు, తెలుగు సినిమా నిర్మాత. (మ.2015) 1941: షరాఫ్ తులసీ రామాచారి , పేరెన్నికగని, వేల కార్టూన్లను

ఐడబ్ల్యుఎస్టి రిక్రూట్మెంట్ 2020

ఐడబ్ల్యుఎస్టి రిక్రూట్మెంట్ 2020: ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఐసిఎఫ్ఆర్ఇ 03 పోస్టుల వద్ద ఫారెస్ట్ గార్డ్ ఖాళీల నియామకానికి సరికొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 15 మే 2020 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐడబ్ల్యుఎస్టి రిక్రూట్మెంట్ 2020 యొక్క ఇతర వివరాలు వయోపరిమితి, విద్యా అర్హత, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు రుసుము మరియు ఎలా దరఖాస్తు చేయాలి వంటివి క్రింద ఇవ్వబడ్డాయి… విద్యార్హతలు :     అభ్యర్థులు 12 వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి లేదా గుర్తింపు పొందిన బోర్డు / విశ్వవిద్యాలయం / సంస్థ నుండి సమానమైనవి లేదా గుర్తింపు పొందిన బోర్డు / విశ్వవిద్యాలయం / సంస్థ నుండి సమానమైనవి.     ఇతర విద్యా అర్హత వివరాలు దయచేసి నోటిఫికేషన్‌కు వెళ్లండి. వయో పరిమితి :     అభ్యర్థుల వయోపరిమితి కనిష్టంగా 18 సంవత్సరాలు, గరిష్టంగా 26 సంవత్సరాలు ఉండాలి.     వయస్సు సడలింపు: - ఎస్సీ / ఎస్టీ / ఓబిసి / పిడబ్ల్యుడి / పిహెచ్ అభ్యర్థులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం. ముఖ్యమైన తేదీలు :     దరఖాస్తు సమర్పించడానికి ప్రారంభ తేదీ: 3 ఏప్రిల్ 2020.     దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: 15 మే 202