విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)


RTE - ACT

భారతదేశం లో : 6 నుంచి 14 ఏండ్లలోపు ఉన్న బాలలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించటానికి ఉద్దేశించిన చట్టమే Right to Free a-d Compulsory Education- Act 2009. 

  • ఈ విద్యాహక్కు చట్టం 2009 ఆగస్టు 28న రాష్ట్రపతి ఆమోదం పొందింది. 
  • కేంద్ర ప్రభుత్వం 2009 ఆగస్టు 26న ఈ బిల్లును ఆమోదించింది. 
  • జమ్ముకశ్మీర్ మినహా దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ చట్టం 2010 ఏప్రిల్ 1న అమల్లోకి వచ్చింది.
  •  ఈ చట్టంలో 7 అధ్యాయాలు, 38 సెక్షన్లు, ఒక అనుబంధ షెడ్యూల్ ఉన్నాయి

విద్యాహక్కు చట్టం ముఖ్యాంశాలు :

అధ్యాయం -1

సెక్షన్-1

  •  చట్టం పేరు: ఉచిత నిర్బంధ విద్య బాలల హక్కు చట్టం 2009
  •  చట్టం పరిధి: జమ్ముకశ్మీర్ మినహా దేశం మొత్తం వర్తిస్తుంది.
  •  చట్టం అమలు తేదీ: 2010, ఏప్రిల్ 1

సెక్షన్-2

  • 6 నుంచి 14 ఏండ్ల మధ్య వయసున్నవారు బాలబాలికలు
  •  ప్రాథమిక విద్య అంటే 1 నుంచి 8 తరగతి వరకు
  •  క్యాపిటేషన్ ఫీజు అంటే బడి ప్రకటించిన ఫీజు కాకుండా ఇతర రూపాల్లో చెల్లించే చందాలు
  •  స్థానిక ప్రభుత్వం అంటే నగరపాలక సంస్థ లేదా జిల్లా పరిషత్ లేదా గ్రామ పంచాయతీ

అధ్యాయం-2

సెక్షన్-3

  •  6 నుంచి 14 ఏండ్లలోపు బాలలందరికీ ఉచిత ప్రాథమిక విద్య పొందే హక్కు ఉంటుంది.
  •  బాలలు ప్రాథమిక విద్య పూర్తిచేయడానికి ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవరసరం లేదు.

సెక్షన్-4

  •  6 నుంచి 14 ఏండ్లలోపు వయసున్న పిల్లలు మధ్యలోనే బడి మానివేస్తే వారిని తిరిగి వారి వయసుకు తగిన తరగతిలో చేర్చుకోవాలి.
  •  వయసుకు తగిన తరగతిలో చేరిన బాలలు తోటి విద్యార్థులతో సమానంగా ఆ తరగతి వరకు కావాల్సిన సామర్థ్యాలను పొందటానికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి.
  •  ఈ విధంగా ప్రాథమిక విద్యలో ప్రవేశించిన బాలలు 14 ఏండ్లు నిండినప్పటికీ ఎలిమెంటరీ విద్యను పూర్తిచేసేవరకు ఉచిత విద్యను పొందే హక్కు ఉంది. 
  •  ఆ విద్యార్థులకు శిక్షణ కాలవ్యవధి కనీసం మూడు నెలలు, గరిష్టంగా రెండేండ్లవరకు ఉండవచ్చు.

సెక్షన్-5

  •  బడిలో ప్రాథమిక విద్య పూర్తిచేసే సదుపాయం లేకపోతే ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏ ఇతర బడికైనా బదిలీ కోరే హక్కు బాలలకు ఉంటుంది. 

అధ్యాయం-3

సెక్షన్-6

  •  ఆర్టీఈ అంశాలు అమలు చేయటానికి పరిసర ప్రాంత పరిధిలో బడి లేకపోతే చట్టం అమల్లోకి వచ్చిన మూడేండ్లలోపు ప్రభుత్వం లేదా స్థానిక సంస్థ బడిని నెలకొల్పాలి.
  •  1 నుంచి 5 తరగతుల వరకు కిలోమీటర్ దూరంలోపు పాఠశాలను ఏర్పాటు చేయాలి. 6 నుంచి 8 తరగతుల బాలలకు 3 కి.మీ.లోపు పాఠశాలను ఏర్పాటుచేయాలి. 
  •  తీవ్రమైన వైకల్యంతో బాధపడే బాలలకు రవాణా సౌకర్యా లు ఏర్పాటుచేయాలి. లేకపోతే ఇంటివద్దే విద్యనందించాలి.

సెక్షన్-7

  •  చట్టాన్ని అమలుచేసేందుకు నిధులను సమకూర్చే బాధ్యత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సమానంగా ఉంటుంది.
  •  రెగ్యులర్ పాఠశాలల్లో బోధించే టీచర్లందరికీ ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు బోధించేందుకు తగిన శిక్షణ ఇవ్వాలి.

సెక్షన్-8

  •  ప్రభుత్వ నియంత్రణలో లేని బడిలో పిల్లలను చేర్పించి, ప్రాథమిక విద్యకు పెట్టిన ఖర్చును తిరిగి చెల్లించాలని అడిగే హక్కు విద్యార్థి తల్లిదండ్రులకు ఉండదు. 

సెక్షన్-9

  •  తమ ఆవాస ప్రాంతాల్లో పుట్టినప్పటి నుంచి 14 ఏండ్లు వచ్చేవరకు పిల్లలందరి రికార్డులను స్థానిక ప్రభుత్వం ఇంటింటి సర్వే ద్వారా నిర్వహించాలి.

సెక్షన్-10

  •  6 నుంచి 14 ఏండ్లలోపు పిలల్లను పరిసర పాఠశాలలో చేర్పించటం ప్రతి తల్లిదండ్రి లేదా సంరక్షకుడి బాధ్యత.

సెక్షన్-11

  •  ఆరేండ్లు నిండే వరకు ప్రాథమిక విద్యకు బాలలను సంసిద్ధులను చేయటానికి పూర్వ ప్రాథమిక విద్యలో చేర్పించడం ప్రతి తల్లిదండ్రి లేదా సంరక్షకుడి బాధ్యత.

అధ్యాయం-4

సెక్షన్-12

  •  బడులు ప్రభుత్వ గ్రాంట్లు ఎంతశాతం పొందుతున్నాయో బడిలో చేరిన పిల్లల్లో అంతశాతం మందికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. కనీసం 25 శాతానికి తగ్గకుండా పిల్లలను బడిలో చేర్చుకోవాలి.
  •  కేంద్రీయ, నవోదయ, సైనిక పాఠశాలలు విద్యార్థుల సంఖ్యలో 25శాతం సీట్లు బలహీనవర్గాలకు, ప్రతికూల పరిస్థితులు ఉన్న పిల్లలకు కేటాయించాలి.

సెక్షన్-13

  •  బాలబాలికలను బడిలో చేర్చుకోవటానికి క్యాపిటేషన్ ఫీజు వసూలు చేయరాదు. బడిలో చేర్చుకొనేందుకు ఎలాంటి ఎంపిక పరీక్ష నిర్వహించరాదు. అనుమతి లేకుండా పరీక్ష నిర్వహిస్తే జరిమానా విధిస్తారు.

సెక్షన్-14

  •  వయసు ధ్రువీకరణ పత్రం లేదన్న కారణంతో బడిలో ప్రవేశాన్ని తిరస్కరించరాదు. 

సెక్షన్-15

  •  విద్యాసంవత్సరంలో బడిలో ప్రవేశానికి సాధారణంగా జూన్ 12 నుంచి ఆగస్టు 31వరకు గడువు ఉంటుంది. గడువు తర్వాత ప్రవేశం కోరినా తిరస్కరించకూడదు. 

సెక్షన్-16

  •  బడిలో ప్రవేశం పొందిన బాలలను ప్రాథమిక విద్య పూర్తయ్యేవరకు బడి నుంచి తొలగించకూడదు.

సెక్షన్-17

  •  బాలలను శారీరకంగా గానీ, మానసికంగా గానీ వేధించరాదు. అలాంటి చర్యలకు పాల్పడిన ఉపాధ్యాయులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి.

సెక్షన్-18

  •  ప్రభుత్వ గుర్తింపు లేకుండా పాఠశాలలను స్థాపించకూడదు. ఈ నియమాన్ని ఉల్లంఘించినవారు శిక్షార్హులు.

సెక్షన్-19

  •  షెడ్యూల్‌లోని నియమాలను పాటించని పాఠశాలలకు గుర్తింపు ఇవ్వకూడదు. ఈ చట్టం అమలుకు ముందే స్థాపించిన పాఠశాలలు చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి మూడేండ్లలోపు తమ సొంత ఖర్చులతో షెడ్యూల్‌లోని నియమనిబంధనల మేరకు సౌకర్యాలు ఏర్పాటుచేయాలి.

సెక్షన్-20

  •  షెడ్యూల్‌లోని నియమాలు, ప్రామాణికాలు తొలగించటం, కొత్తగా చేర్చటం లేదా సవరణ చేయటం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. 

సెక్షన్-21

  •  అన్ ఎయిడెడ్ పాఠశాలలు తప్ప ప్రతి పాఠశాలలోనూ స్థానిక ప్రజాప్రతినిధులు, బడిలోని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో బడి యాజమాన్య సంఘాన్ని ఏర్పాటుచేయాలి. కమిటీ మొత్తం సభ్యుల్లో 50 శాతం మహిళలు ఉండాలి. ఈ కమిటీకి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కన్వీనర్‌గా ఉండాలి.

సెక్షన్-22

  •  పాఠశాల యాజమాన్య కమిటీ ఏటా నవంబర్‌లో పాఠశాల అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలి.

సెక్షన్-23

  •  ఉపాధ్యాయుల నియామకంలో అవసరమైన అర్హతలు, ఉద్యోగ షరతులు, నిబంధనలు కచ్చితంగా పాటించాలి.

సెక్షన్-24

  •  ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి. నిర్ధారిత సమయంలో పాఠ్యాంశాలు పూర్తిచేయాలి.

సెక్షన్-25

  •  షెడ్యూల్‌లో నిర్ధారించిన విధంగా విద్యార్థులు-ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

సెక్షన్-26

  •  ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలి. మొత్తం ఉపాధ్యా య పోస్టుల్లో ఖాళీలు పదిశాతానికి మించకుండా చూడాలి.

సెక్షన్-27

  •  జనాభా గణన, ఎన్నికల విధులకు తప్ప ఉపాధ్యాయులను ఏ విద్యేతర పనులకు వినియోగించరాదు. 

సెక్షన్-28

  •  ఏ ఉపాధ్యాయుడు కూడా ప్రైవేటు ట్యూషన్స్, ప్రైవేటు బోధన పనులు చేయరాదు. 

అధ్యాయం-5

సెక్షన్-29

  •  బాలల జ్ఞానం, సామర్థ్యం, నైపుణ్యాలు పెంపొందించి వారి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే పాఠ్యప్రణాళిక, మూల్యాంకన విధానాన్ని నిర్ధారించి పూర్తిచేయాలి.

సెక్షన్-30

  •  ఎలిమెంటరీ విద్య పూర్తయ్యేవరకు బాలలు ఎలాంటి బోర్డు పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు.

అధ్యాయం-6

సెక్షన్-31

  •  విద్యపై బాలలకు ఉన్న హక్కులను పరిశీలించి, కాపాడే ఏర్పాట్లను సమీక్షించి సమర్థవంతంగా అమలయ్యేందుకు తగిన సూచనలు చేసి బాలల హక్కులను పర్యవేక్షించాలి.

సెక్షన్-32

  •  విద్యాహక్కు చట్టం ఉల్లంఘనకు గురైన పక్షంలో ఎవరైనా స్థానిక ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చు.

సెక్షన్-33, 34

  •  బాలల హక్కుల రక్షణకు జాతీయ, రాష్ట్ర సలహా సంఘాలను ఏర్పాటుచేయాలి.

అధ్యాయం-7

సెక్షన్-35

  •  చట్టం అమలు కోసం సంబంధిత ప్రభుత్వాలకు మార్గదర్శక సూత్రాలు, ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం జారీచేస్తుంది. 

సెక్షన్-36

  •  శిక్షార్హమైన నేరాలకు సంబంధిత ప్రభుత్వ ప్రకటన ద్వారా అధీకృతం చేసిన అధికారి ఆమోదం పొందిన తర్వాతే ప్రాసిక్యూషన్ చేపట్టాలి.

సెక్షన్-37

  •  సదుద్దేశంతో చేపట్టిన చర్యలకు రక్షణ కల్పించాలి.

సెక్షన్-38

  •  చట్ట నియమాలు రూపొందించటానికి సంబంధిత ప్రభుత్వానికి అధికారం ఉంటుంది.

షెడ్యూల్ బడి నియమాలు, ప్రామాణికాలు

1 నుంచి 5వ తరగతి వరకు

  •  60 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు
  •  61 నుంచి 90 మంది బాలల వరకు ముగ్గురు 

ఉపాధ్యాయులు

  •  91 నుంచి 120 మంది విద్యార్థుల వరకు నలుగురు
  •  121 నుంచి 200 వరకు ఐదుగురు ఉపాధ్యాయులు
  • 150 మించి విద్యార్థులు ఉంటే ఐదుగురు 

ఉపాధ్యాయులు, ఒక ప్రధానోపాధ్యాయుడు

  •  200 మించి విద్యార్థులు ఉంటే ప్రధానోపాధ్యాయుడు కాకుండా ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి
  •  1 నుంచి 5వ తరగతి వరకు విద్యా సంవత్సరంలో 200 పనిదినాలు, 800 బోధనా గంటలు ఉండాలి.

6 నుంచి 8వ తరగతి వరకు
  •  ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. కింది అంశాలకు కనీసం ఒక ఉపాధ్యాయుడు ఉండాలి.

1. విజ్జానశాస్త్రం, లెక్కలు, 2. సామాజిక శాస్త్రం 3.భాషలు

  •  ప్రతి 35 మంది విద్యార్థులకు కనీసం ఒక ఉపాధాయ్యు డు ఉండాలి.
  •  బడిలో చేర్చుకున్న విద్యార్థుల సంఖ్య 100కు మించితే పూర్తికాల ప్రధానోపాధ్యాయుడితోపాటు
1. చిత్రకళ, 2. ఆరోగ్యం, వ్యాయామ విద్య

3. వృత్తి విద్యలకు పార్ట్‌టైం బోధకులు ఉండాలి

  • 6-8 తరగతులకు 220 పనిదినాలు, 1000 బోధనా గంటలు ఉండాలి.
  • ప్రతి టీచర్‌కు ఒక తరగతి గది ఉండాలి
  •  వారానికి కనీసం బోధన 45 గంటలు ఉండాలి.


Popular posts from this blog

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

🌏 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 28