చరిత్ర లో ఈరోజు జూన్-5.


సంఘటనలు

1968: అమెరికా సెనేటరు రాబర్ట్ ఎఫ్. కెన్నడీపై సిర్హన్ సిర్హన్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ సంఘటన లాస్ ఆంజిల్స్‌లోని ది అంబాసిడర్ హోటల్లోని వంటశాలలో జరిగింది.

1972: స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలో మొట్టమొదటి పర్యావరణ సదస్సు నిర్వహించబడింది.

1977 : మొదటి వ్యక్తిగత కంప్యూటర్ "ఆపిల్ 2" అమ్మకమునకు విడుదల.

1995 : "బోస్-ఐన్‌స్టీన్ కండెన్సేట్"ను మొదటి సారి సృష్టించారు.

2008: 3000 మీటర్ల పరుగులో సురేంద్రసింగ్ భారత జాతీయ రికార్డు సృష్టించాడు. 16 సంవత్సరాల బహదూర్ ప్రసాద్ రికార్డు ఛేదించబడింది.

జననాలు

1908: రావి నారాయణరెడ్డి, కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ పోరాటంలో ముఖ్యుడు. (మ.1991)

1932 : భారతీయ మహిళా శాస్త్రవేత్తల సంఘం నకు మొదటి అధ్యక్షురాలు సుమతి భిడే జననం (మ.1999).

1934: చెన్నుపాటి విద్య, భారత పార్లమెంటు సభ్యురాలు, సంఘ సేవిక.

1941: ఆచార్య ఎస్వీ రామారావు, పి.హెచ్.డి. పరిశోధనా పర్యవేక్షకుడిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇతని పర్యవేక్షణలో 19 పి.హెచ్.డి పరిశోధనలు, 15 ఎం.ఫిల్ పరిశోధనలు జరిగాయి.

1943: రాయపాటి సాంబశివరావు, భారత పార్లమెంటు సభ్యుడు.

1961: రమేశ్ కృష్ణన్, భారత టెన్నిస్ క్రీడాకారుడు.

1968: మూరెళ్ల ప్రసాద్, తెలుగు సినిమా ఛాయాగ్రాహకుడు. ఇతడు ఎక్కువగా తెలుగు, కొన్ని తమిళ సినిమాలకు పనిచేశారు.

1976: రంభ (నటి), తెలుగు సినిమా నటి.

మరణాలు

1910 : ప్రఖ్యాత అమెరికన్ రచయిత ఓ.హెన్రీ మరణం (జ.1862).

1973: మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్, గురూజీగా ప్రసిద్ధి చెందిన హిందుత్వ నాయకుడు (జ.1906).

1996: ఆచార్య కుబేర్‌నాథ్ రాయ్, భారతీయ రచయిత, జ్ఞానపీఠ పురస్కర గ్రహీత (జ.1933).

పండుగలు , జాతీయ దినోత్సవాలు.

ప్రపంఛ పర్యావరణ దినోత్సవం

Popular posts from this blog

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

🌏 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 28